అబుధాబి చేరుకున్న ప్రధాని మోడీ...
- July 15, 2023
అబుధాబి: భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుధాబి చేరుకున్నారు. అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. మోదీ అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈరోజు విమానాశ్రయంలో తనను రిసీవ్ చేసుకున్నందుకు షేక్ ఖలీద్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనను స్వాగతించినందుకు క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు కూడా కృతజ్ఞతలు అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
యూఏఈలో అధికారిక పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మోదీ సమావేశమై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్రమంగా బలపడుతోంది.ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్టెక్, రక్షణ మరియు సంస్కృతి వంటి వివిధ డొమైన్లలో దీనిని ముందుకు తీసుకెళ్లే మార్గాలను గుర్తించడానికి ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశంగా ఉంటుంది" మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా నిన్న రాత్రి భారత త్రివర్ణ జెండాను ప్రదర్శించింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









