అబుధాబి చేరుకున్న ప్రధాని మోడీ...
- July 15, 2023
అబుధాబి: భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుధాబి చేరుకున్నారు. అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. మోదీ అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈరోజు విమానాశ్రయంలో తనను రిసీవ్ చేసుకున్నందుకు షేక్ ఖలీద్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనను స్వాగతించినందుకు క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు కూడా కృతజ్ఞతలు అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
యూఏఈలో అధికారిక పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మోదీ సమావేశమై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్రమంగా బలపడుతోంది.ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్టెక్, రక్షణ మరియు సంస్కృతి వంటి వివిధ డొమైన్లలో దీనిని ముందుకు తీసుకెళ్లే మార్గాలను గుర్తించడానికి ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశంగా ఉంటుంది" మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా నిన్న రాత్రి భారత త్రివర్ణ జెండాను ప్రదర్శించింది.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







