తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు
- July 15, 2023
హైదరాబాద్: తిరుమల, షిర్డీ వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుమల, షిర్డీకి ప్రభుత్వం ఏసీ స్లీపర్ బస్సులు నడపనుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమల, షిర్డీకి ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్-తిరుమలకు రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పెద్దలకు రూ.4,200, పిల్లలకు రూ.3,360 టికెట్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్యాకేజీలో భక్తులకు శ్రీఘ్రదర్శన టికెట్లను అందించనున్నట్లు వెల్లడించారు.
కొత్తగా రూ.3.5 కోట్లతో 2 అత్యాధునిక ఓల్వో మల్టీ ఎక్సెల్ ఏసీ స్లీపర్ కోచ్ బసు సర్వీసులను,
32.61 లక్షలతో మినీ ఏసీ బస్సు సర్వీసులను పర్యాటక శాఖ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పర్యటక శాఖ ఎండీ మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







