తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు
- July 15, 2023
హైదరాబాద్: తిరుమల, షిర్డీ వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుమల, షిర్డీకి ప్రభుత్వం ఏసీ స్లీపర్ బస్సులు నడపనుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమల, షిర్డీకి ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్-తిరుమలకు రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పెద్దలకు రూ.4,200, పిల్లలకు రూ.3,360 టికెట్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్యాకేజీలో భక్తులకు శ్రీఘ్రదర్శన టికెట్లను అందించనున్నట్లు వెల్లడించారు.
కొత్తగా రూ.3.5 కోట్లతో 2 అత్యాధునిక ఓల్వో మల్టీ ఎక్సెల్ ఏసీ స్లీపర్ కోచ్ బసు సర్వీసులను,
32.61 లక్షలతో మినీ ఏసీ బస్సు సర్వీసులను పర్యాటక శాఖ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పర్యటక శాఖ ఎండీ మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









