ఈ సారీ బోనాలకు పిలుపు రాలేదు: టి.గవర్నర్ తమిళి సై
- July 16, 2023
హైదరాబాద్: ఎప్పటి లాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు పిలుపు రాలేదని గవర్నర్ తమిళిసై అన్నారు. అందుకే రాజ్భవన్లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లాల్దర్వాజా బోనాల సందర్భంగా రాజ్భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గవర్నర్ బోనం సమర్పించి వడి బియ్యం పోశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కఅతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని.. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మరోవైపు చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







