ఈ సారీ బోనాలకు పిలుపు రాలేదు: టి.గవర్నర్‌ తమిళి సై

- July 16, 2023 , by Maagulf
ఈ సారీ బోనాలకు పిలుపు రాలేదు: టి.గవర్నర్‌ తమిళి సై

హైదరాబాద్‌: ఎప్పటి లాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు పిలుపు రాలేదని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అందుకే రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా రాజ్‌భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గవర్నర్‌ బోనం సమర్పించి వడి బియ్యం పోశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కఅతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని.. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మరోవైపు చంద్రయాన్‌-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com