ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు

- May 16, 2016 , by Maagulf
ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు

 తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. సినీనటులు కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, కుష్బూ దంపతులు, మీనా, రాధిక, జీవా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేశారు. ఓటుహక్కు వినియోగించుకోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు వేయడం అందరి బాధ్యత అని స్టాలిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజలు ముందుకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చార కేరళలో.. కేరళ సీఎం ఉమెన్‌ఛాందీ కొట్టాయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, సినీనటులు మమ్ముట్టీ, సురేశ్‌గోపి, మాజీ కేంద్ర మంత్రులు ఏకే ఆంటోని, శశిథరూర్‌లు ఓటు వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com