ఏడాది తర్వాత రాజ్భవన్కు కేసీఆర్..అసలు కారణమేంటంటే...
- July 23, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 13 మాసాల తర్వాత రాజ్ భవన్ లో అడుగు పెట్టారు.ఈ మధ్య కాలంలో రాజ్ భవన్ లో జరిగిన ఏ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేదు.
దాదాపు ఏడాది తర్వాత రాజ్ భవన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత నుండి రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు మాత్రమే కేసీఆర్ ఇవాళ రాజ్ భవన్ కు చేరుకున్నారు.
2022 జూన్ 28వ తేదీన హైద్రాబాద్ రాజ్ భవన్ లో ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి తొమ్మిది మాసాల తర్వాత కేసీఆర్ రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత రాజ్ భవన్ లో జరిగిన ఏ కార్యక్రమానికి కూడ కేసీఆర్ హాజరు కాలేదు.
రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోం వంటి కార్యక్రమాలకు కూడ ఆయన దూరంగా ఉంటున్నారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కారణంగా కేసీఆర్ రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారు.
ఇటీవలనే హైద్రాబాద్ కు రాష్ట్రపతి వచ్చిన సమయంలో హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు కేసీఆర్, గవర్నర్ ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో గవర్నర్, కేసీఆర్ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాష్ట్రపతి విమానం వచ్చేవరకు వీరిద్దరూ మాట్లాడుకుంటూ కన్పించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. రాష్ట్ర బడ్జెట్ ను ఆమోదించలేదని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని సుప్రీంకోర్టును కూడ కేసీఆర్ సర్కార్ ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







