ఖతార్‌లో భారత రాయబారిగా విపుల్‌ నియాయకం

- July 24, 2023 , by Maagulf
ఖతార్‌లో భారత రాయబారిగా విపుల్‌ నియాయకం

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలోని MEA ప్రధాన కార్యాలయంలో గల్ఫ్ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న విపుల్‌ ను గల్ఫ్ దేశమైన ఖతార్‌లో భారత రాయబారిగా నియమించారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన విపుల్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు MEA పేర్కొంది. గతంలో ఖతార్ లో రాయబారిగా పనిచేసిన దీపక్ మిట్టల్ మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com