చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
- July 24, 2023
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత ఇంటి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. చంద్రబాబు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. దీంతో ఇంటి నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. అయితే, వివిధ కారణాల వలన ఇంటి నిర్మాణానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు మంజూరు చేయకపోవడంతో వివాదం చెలరేగింది.
అన్ని పత్రాలు సమర్పించినా ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడం పట్ల ఇటీవల కుప్పం పర్యటనలోనూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కాగా, తాజాగా చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







