శ్రీవారి భక్తులకు అలర్ట్..

- July 25, 2023 , by Maagulf
శ్రీవారి భక్తులకు అలర్ట్..

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. నెల రోజుల పాటు అంటే.. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్క‌రిణి మూసివేస్తారు. ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ‌వారి పుష్క‌రిణిలో నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నట్లు టీటీడీ తెలిపింది.

ఇందుకోసం ఆగస్టు 1వ తేదీ నుండి 31 వరకు పుష్క‌రిణిని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే, నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి రద్దు చేశారు. శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల నేపథ్యంలో పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొల‌గించి మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల సమయం పట్టనుంది.

పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం తొలి 10 రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ తర్వాత 10 రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com