యూఏఈ లో 40 శాతం పెరిగిన ఇండియన్ రైస్ ధరలు..!
- July 26, 2023
యూఏఈ: బియ్యం ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించిన తర్వాత యూఏఈలోని బియ్యం ధరలు 40 శాతం వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. అయితే, ఇది తాత్కాలిక సమస్య అని, కొత్త సరఫరాదారులు మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత త్వరలో ధరలు అందుబాటులోకి వస్తాయని రిటైలర్లు చెబుతున్నారు. వియత్నాం, థాయిలాండ్, పాకిస్తాన్ దేశాలలో రైస్ ఉత్పత్తి కొరత కారణంగా భారతదేశం ఎగుమతి నిషేధం తరువాత బాస్మతీయేతర బియ్యానికి యూఏఈలో డిమాండ్ ఏర్పడింది. బియ్యం ఎగుమతిలో భారతదేశం అతిపెద్ద బియ్యం ఎగుమతిదారులలో ఒకటిగా ఉంది. యూఏఈకి బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి పైగా వాటా ఇండియా కలిగిఉంది. గత సంవత్సరం మొత్తం 55.4 మిలియన్ మెట్రిక్ టన్నులు యూఏఈకి దిగుమతి అయ్యాయి. యూఏఈ దిగుమతిదారులకు బియ్యం దిగుమతి చేసుకునే ప్రధాన దేశఆలలో భారతదేశం తొలి ప్రాధాన్యత దేశంగా ఉందని అల్ మాయా గ్రూప్లో గ్రూప్ డైరెక్టర్, భాగస్వామి కమల్ వచాని తెలిపారు. స్థానిక వినియోగంలో బాస్మతీయేతర బియ్యం వాటా 45 శాతం, ఎక్కువగా దక్షిణ భారతీయులు వినియోగిస్తారని ఆయన అన్నారు. ధరలు 40 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఫలితంగా, నివాసితులు ఖరీదైన ప్రధాన ఆహారానికి మారడం వల్ల బాస్మతి బియ్యం డిమాండ్ కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









