శుద్రపూజల పేరిట మోసం. 7 మందికి జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరిమానా
- July 27, 2023
యూఏఈ: శుద్రపూజల పేరిట పలువురిని మోసగించిన ఏడుగురికి యూఏఈలో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వారికి 50,000 దిర్హామ్ల జరిమానా కూడా విధించారు. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బుధవారం కేసు వివరాలను వెల్లడించింది. నిందితుల ముఠాలోని సభ్యులు తమకు జిన్ రాజుల శక్తి(అదృశ్య శక్తులు) ఉన్నాయని పలువురిని నమ్మించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలను దూరం చేసే అనేక శక్తులు ఉన్నాయని నమ్మించి పలువురిని మోసం చేశారు. చేతబడి చేయడం, మోసం, శుద్రపూజల వంటి ఆరోపణలపై ఏడుగురిని కోర్టుకు తరలించారు. తరువాత వారికి 6 నెలల జైలు శిక్ష, జ్యుడీషియల్ ఫీజుతో పాటు 50,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని జారీ చేసే ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021 ప్రకారం, చేతబడి మరియు మోసం భారీ జరిమానాలతో శిక్షించదగిన నేరాలు అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పునరుద్ఘాటించింది. చేతబడికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే తమకు తెలియజేయాలని అధికారులు నివాసితులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!







