శుద్రపూజల పేరిట మోసం. 7 మందికి జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరిమానా
- July 27, 2023
యూఏఈ: శుద్రపూజల పేరిట పలువురిని మోసగించిన ఏడుగురికి యూఏఈలో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వారికి 50,000 దిర్హామ్ల జరిమానా కూడా విధించారు. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బుధవారం కేసు వివరాలను వెల్లడించింది. నిందితుల ముఠాలోని సభ్యులు తమకు జిన్ రాజుల శక్తి(అదృశ్య శక్తులు) ఉన్నాయని పలువురిని నమ్మించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలను దూరం చేసే అనేక శక్తులు ఉన్నాయని నమ్మించి పలువురిని మోసం చేశారు. చేతబడి చేయడం, మోసం, శుద్రపూజల వంటి ఆరోపణలపై ఏడుగురిని కోర్టుకు తరలించారు. తరువాత వారికి 6 నెలల జైలు శిక్ష, జ్యుడీషియల్ ఫీజుతో పాటు 50,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని జారీ చేసే ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021 ప్రకారం, చేతబడి మరియు మోసం భారీ జరిమానాలతో శిక్షించదగిన నేరాలు అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పునరుద్ఘాటించింది. చేతబడికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే తమకు తెలియజేయాలని అధికారులు నివాసితులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









