దేష్ తీవ్రవాదులకు మద్దతు పలికిన ఇరాకీ మహిళకు శిక్ష
- May 16, 2016
మనామా: సౌదీ రాజధాని రియాధ్ లో ఒక కోర్టు ఒక ఇరాకీ మహిళ ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ మహిళ దేష్ తీవ్రవాద సమూహంకు మద్దతు పలికినందుకు ఈ శిక్ష పడిన ప్రతివాది వీడియో సంక్షిప్త చిత్రాన్ని సామాజిక మీడియా నెట్ వర్కు ద్వారా ముద్దాయి పలువురికి పంపబడినట్లు కనుగొనబడింది. దేష్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి అనేక మంది మహిళలకు ఆమె దానిని పంపినట్లు రుజువయ్యైంది. అంతేకాక ఆమె తన భర్తని పోరాడటానికి ప్రోత్సహించే విధంగా తన భర్తకు ఆడియో రికార్డింగ్ సందేశం పంపించింది .అమర్యాదకరమైన వివరణలు ఉపయోగించి ఆ మహిళ పబ్లిక్ ఆర్డర్ మరియు అవమానకరమైన రీతిలో సౌదీ అరేబియాని అణగదొక్కాలని ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తినట్లు సౌదీ రోజువారీ అల వతన్ సోమవారం వెల్లడించింది.ప్రతివాది ఆమె భర్త ఇంటి వద్ద ఉంచిన రెండు ల్యాప్టాప్లు సమాచారం మరియు వాటిలో దాచి నిల్వ సమాచారం అన్ని వివరాలు తొలగించడానికి ప్రయత్నించిందని తద్వారా పరిశోధకులని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిచిందని తెలిపింది. చట్టవిరుద్ధంగా ఇరాక్ వెళ్ళడానికి తన భర్తను ప్రోత్సాహించడమే కాక చట్టాన్ని ఉల్లంఘించైనా తన భర్త పై ప్రభుత్వానికి పిర్యాదు చేయకపోవడం మరియు ఆమె సోదరుడు ఇరాక్ లో ఉండి ఈ ప్రయత్నం తన భర్త సమన్వయం ఉన్నప్పుడు భద్రతా అధికారులకు తెలియచేయనందుకు ఆ మహిళ జైలుశిక్షకు అర్హురాలని రోజువారీ అల వతన్ లో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







