దేష్ తీవ్రవాదులకు మద్దతు పలికిన ఇరాకీ మహిళకు శిక్ష
- May 16, 2016
మనామా: సౌదీ రాజధాని రియాధ్ లో ఒక కోర్టు ఒక ఇరాకీ మహిళ ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ మహిళ దేష్ తీవ్రవాద సమూహంకు మద్దతు పలికినందుకు ఈ శిక్ష పడిన ప్రతివాది వీడియో సంక్షిప్త చిత్రాన్ని సామాజిక మీడియా నెట్ వర్కు ద్వారా ముద్దాయి పలువురికి పంపబడినట్లు కనుగొనబడింది. దేష్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి అనేక మంది మహిళలకు ఆమె దానిని పంపినట్లు రుజువయ్యైంది. అంతేకాక ఆమె తన భర్తని పోరాడటానికి ప్రోత్సహించే విధంగా తన భర్తకు ఆడియో రికార్డింగ్ సందేశం పంపించింది .అమర్యాదకరమైన వివరణలు ఉపయోగించి ఆ మహిళ పబ్లిక్ ఆర్డర్ మరియు అవమానకరమైన రీతిలో సౌదీ అరేబియాని అణగదొక్కాలని ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తినట్లు సౌదీ రోజువారీ అల వతన్ సోమవారం వెల్లడించింది.ప్రతివాది ఆమె భర్త ఇంటి వద్ద ఉంచిన రెండు ల్యాప్టాప్లు సమాచారం మరియు వాటిలో దాచి నిల్వ సమాచారం అన్ని వివరాలు తొలగించడానికి ప్రయత్నించిందని తద్వారా పరిశోధకులని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిచిందని తెలిపింది. చట్టవిరుద్ధంగా ఇరాక్ వెళ్ళడానికి తన భర్తను ప్రోత్సాహించడమే కాక చట్టాన్ని ఉల్లంఘించైనా తన భర్త పై ప్రభుత్వానికి పిర్యాదు చేయకపోవడం మరియు ఆమె సోదరుడు ఇరాక్ లో ఉండి ఈ ప్రయత్నం తన భర్త సమన్వయం ఉన్నప్పుడు భద్రతా అధికారులకు తెలియచేయనందుకు ఆ మహిళ జైలుశిక్షకు అర్హురాలని రోజువారీ అల వతన్ లో తెలిపారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









