ఇండియన్ ఎయిర్లైన్స్ కు 3 మిలియన్ల జరిమానా
- July 29, 2023
యూఏఈ: కేవలం ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్ ఘటనలకు సంబంధించిన ఎయిర్లైన్ రికార్డుపై భారత పౌర విమానయాన అథారిటీ ఇండిగోపై రూ.3 మిలియన్ల పెనాల్టీని విధించింది. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ లేదా ఎంపెనేజ్ భూమిని లేదా ఏదైనా ఇతర స్థిరమైన వస్తువును తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. వరుస ఘటనల నేపథ్యంలో ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో ఎయిర్లైన్స్పై ప్రత్యేక ఆడిట్ను నిర్వహించింది. ప్రత్యేక ఆడిట్ సమయంలో కార్యకలాపాలు, శిక్షణా విధానాలు మరియు ఇంజనీరింగ్ విధానాలకు సంబంధించిన ఇండిగో డాక్యుమెంటేషన్లో "కొన్ని వ్యవస్థాపరమైన లోపాలు" గుర్తించారు. నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలు2023లో మొదటి 6 నెలల వ్యవధిలో నమోదయ్యాయి. నిర్ణీత గడువులోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా నిర్దేశిస్తూ అథారిటీ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత నెలలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు టెయిల్ స్ట్రైక్ చేసినందుకు ఇండిగో పైలట్ మరియు కో-పైలట్ల లైసెన్స్ను బుధవారం డిజిసిఎ సస్పెండ్ చేసింది. వారి లైసెన్సులను వరుసగా మూడు నెలలు, ఒక నెలపాటు సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









