ఇండియన్ ఎయిర్లైన్స్ కు 3 మిలియన్ల జరిమానా
- July 29, 2023
యూఏఈ: కేవలం ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్ ఘటనలకు సంబంధించిన ఎయిర్లైన్ రికార్డుపై భారత పౌర విమానయాన అథారిటీ ఇండిగోపై రూ.3 మిలియన్ల పెనాల్టీని విధించింది. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ లేదా ఎంపెనేజ్ భూమిని లేదా ఏదైనా ఇతర స్థిరమైన వస్తువును తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. వరుస ఘటనల నేపథ్యంలో ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో ఎయిర్లైన్స్పై ప్రత్యేక ఆడిట్ను నిర్వహించింది. ప్రత్యేక ఆడిట్ సమయంలో కార్యకలాపాలు, శిక్షణా విధానాలు మరియు ఇంజనీరింగ్ విధానాలకు సంబంధించిన ఇండిగో డాక్యుమెంటేషన్లో "కొన్ని వ్యవస్థాపరమైన లోపాలు" గుర్తించారు. నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలు2023లో మొదటి 6 నెలల వ్యవధిలో నమోదయ్యాయి. నిర్ణీత గడువులోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా నిర్దేశిస్తూ అథారిటీ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత నెలలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు టెయిల్ స్ట్రైక్ చేసినందుకు ఇండిగో పైలట్ మరియు కో-పైలట్ల లైసెన్స్ను బుధవారం డిజిసిఎ సస్పెండ్ చేసింది. వారి లైసెన్సులను వరుసగా మూడు నెలలు, ఒక నెలపాటు సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







