మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్: ట్రక్ ప్రమాదం
- May 16, 2016
మొబైల్ మాట్లాడుతూ ఓ ట్రక్ని నడిపిన డ్రైవర్, ఆ ట్రక్ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ప్రమాదంలో ట్రక్కు బ్రిడ్జిపైనుంచి కిందికి పడిపోయింది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదంలో ఒమన్కి చెందిన వ్యక్తితోపాటు, వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. 485 కార్టన్ల మినరల్ వాటర్, జ్యూసెస్, మిల్క్ని తరలిస్తూ, నిబంధనల్ని ఉల్లంఘించింది ఆ ట్రక్. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కు వేగం 100 నుంచి 120 కిలోమీటర్లు గంటకు ప్రయాణిస్తోందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంతో రెండు గంటలకు పైనే ట్రాఫిక్ జామ్ అయ్యింది. అతి వేగంతో ప్రయాణిస్తూ ఓవర్టేక్ చేయడంకూడా ఈ ప్రమాదానికి కారణం. 2014తో పోల్చితే 2015లో రోడ్డు ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. 2014లో జరిగిన ప్రమాదాల్లో 816 మంది ప్రాణాలు కోల్పోగా, 2015లో 675 మంది ప్రాణాలు కోల్పోయారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 2015 జులైలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 626 యాక్సిడెంట్లు ఈ నెలలో జరిగాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







