మొబైల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌: ట్రక్‌ ప్రమాదం

- May 16, 2016 , by Maagulf
మొబైల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌: ట్రక్‌ ప్రమాదం

మొబైల్‌ మాట్లాడుతూ ఓ ట్రక్‌ని నడిపిన డ్రైవర్‌, ఆ ట్రక్‌ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ప్రమాదంలో ట్రక్కు బ్రిడ్జిపైనుంచి కిందికి పడిపోయింది. రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదంలో ఒమన్‌కి చెందిన వ్యక్తితోపాటు, వలసదారుడొకరు ప్రాణాలు కోల్పోయారు. 485 కార్టన్ల మినరల్‌ వాటర్‌, జ్యూసెస్‌, మిల్క్‌ని తరలిస్తూ, నిబంధనల్ని ఉల్లంఘించింది ఆ ట్రక్‌. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కు వేగం 100 నుంచి 120 కిలోమీటర్లు గంటకు ప్రయాణిస్తోందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంతో రెండు గంటలకు పైనే ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అతి వేగంతో ప్రయాణిస్తూ ఓవర్‌టేక్‌ చేయడంకూడా ఈ ప్రమాదానికి కారణం. 2014తో పోల్చితే 2015లో రోడ్డు ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. 2014లో జరిగిన ప్రమాదాల్లో 816 మంది ప్రాణాలు కోల్పోగా, 2015లో 675 మంది ప్రాణాలు కోల్పోయారని రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. 2015 జులైలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 626 యాక్సిడెంట్లు ఈ నెలలో జరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com