మోడ్రన్ మీడియా పట్ల ఖతారీల్లో ఆసక్తి
- May 16, 2016
మోడ్రన్ సొసైటీతో తమ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాలని 10 మందిలో 8 మంది ఖతారీలు భావిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడయ్యింది. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఇన్ ఖతార్ విడుదల చేసిన ఈ సర్వే 'మీడియా యూజ్ ఇన్ మిడిల్ ఈస్ట్ 2016' పేరుతో జరిగింది. మోడ్రన్ మీడియాని ఖతారీలు ఎక్కువగా వినియోగిస్తున్నారనీ, సాధారణ టెలివిజన్ ప్రోగ్రామ్స్తో పోల్చితే, ఇతరత్రా మార్గాలపైనే వారు ఎక్కువ దృష్టి పెడ్తున్నారని ఎన్యు-క్యూ జర్నలిజం ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ జస్టిన్ మార్టిన్ చెప్పారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ ప్రింట్ మెటీరియల్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ విషయంలో అరేబియా (8 శాతం), ఈజిప్ట్ (3 శాతం)తో పోల్చితే ఖతారీ మరియు యూఏఈ నేషనల్స్ (24 శాతం) ముందంజలో ఉన్నారని ఆ సర్వే వెల్లడించింది. ఖతారీలు తమ దేశానికి సంబంధించిన విషయాల మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. ఖతారీలు వార్తలపై ఎక్కువ ఫోకస్ పెడ్తారు. రీజియన్లో మిగతావారితో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా ఖతారీలు ఫేస్బుక్ని వినియోగిస్తున్నారు. ఖతారీలు ట్విట్టర్ని పలు విధాలుగా వినియోగిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై ట్విట్టర్ ద్వారా తెలుసుకోవడం, తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







