మలై జామూన్ పలావ్
- June 24, 2015
బాస్మతి రైస్ : 500గ్రా
కోవా : 200గ్రా
పనీర్ : 50 గ్రా
గరం మసాలా : 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి : 4
పలావు ఆకులు : 2
నెయ్యి : 3 టేబుల్ స్పూన్లు
నూనె : వేయించడానికి సరపడా
ఉల్లిపాయలు : 3
పెరుగు : 3 టేబుల్ స్పూన్లు
పుదీనా : ఒక కట్ట
కొత్తిమీర : ఒక కట్ట
షాజీరా : అర టీ స్పూను
కుంకుమ పువ్వు : చిటికెడు
తయారీ విధానం
ఒక బాణలి తీసుకుని దానిలో పన్నీర్, కోవా వేసి మెత్తగా చిదమాలి. దానికి సరిపడా ఉప్పు, ఒక చెంచా గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న జామూన్ల్లా చేసి నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేలా వేయించి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో అల్లం, వెల్లుల్లి , ఉప్పు, గరం మసాలా,రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. తరువాత దానిలో బియ్యం వేసి కాస్త పలుకు ఉండేలా ఉడికించి దించాలి. ఇప్పుడు వేరే బాణలి తీసుకుని దానిలో కొద్దిగా నూనె పోసి అందులో పెరుగు, మిగిలిన పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, కొద్దిగా గరం మసాలా, సరిపడా ఉప్పు వేసి కలిపి, అందులో వేయించిన జామూన్లు కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఒక మందపాటి బాణలి తీసుకుని అడుగున ఉడికించిన అన్నం ఒక పొరలా వేసి దానిపై జామూన్స్ కలిపిన మిశ్రమం వేసి, దానిపై మిగిలిన అన్నాన్ని సర్దాలి. ఆ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, నెయ్యి, కుంకుమ పువ్వు, అవసరం అనుకుంటే కొద్దిగా వేయించిన జీడిపప్పు చల్లినట్లుగా వేసి, మూత పెట్టి, పది నిముషాలు దమ్ చేసి తీయాలి. వేడి వేడిగా దమ్ మలై జామూన్ పలావ్ రెడీ!
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







