'TAMA' ఎడ్యుకేషన్ సెమినార్కు అనూహ్య స్పందన
- August 04, 2023
అమెరికా: 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) నిర్వహించిన ఎడ్యుకేషన్ సెమినార్కు విశేష స్పందన లభించింది. తామా వారి కార్యక్రమాలలో ఇది మరో కలికితురాయిగా చేరింది. స్థానిక కమ్మింగ్లోని షారన్ కమ్యూనిటీ భవనంలో శనివారం, జూలై 22న నిర్వహించిన ఒక ప్రత్యేక, ఉపయోగకరమైన విద్యా సెమినార్ లో 200 మందికి పైగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరు కావడంతో నిర్వాహకులు నేలపై టార్పాలిన్ పట్టాలు వేసి విద్యార్థులు కూర్చోవాలని కోరారు. చాలా మంది నిలబడి మరీ విన్నారు. విద్య అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, విద్యా నిపుణురాలు డాక్టర్ వాణి గడ్డం చేసిన ఈ వివరణాత్మక సెమినార్ ద్వారా హాజరైన వారికి ఎన్నో మంచి విషయాలు తెలియటమే కాకుండా, సరైన మార్గంలో వెళ్ళడానికి కూడా సహాయపడుతుంది. ఇది 2023లో తామా వారి 16వ కార్యక్రమం, క్లుప్త వేసవి విరామం తర్వాత మొదటిది. ముఖ్యమైన విషయాలను విపులీకరిస్తూ, పరస్పర సంభాషణలతో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా జరిగింది.
స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఎంతో ఆసక్తిగా పాల్గొని, చివరి వరకు ఉండి, అనేక ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విచ్చేసిన వారు తామా ని అభినందించి, ఇలాంటి మరెన్నో చేయాలని విజ్ఞప్తి చేశారు. తామా బహుముఖ మరియు అన్ని వయసుల వారికి ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తోంది. రాబోయే ఈవెంట్ ఆగస్టు 13న ‘తామా వీక్లీ ఫ్రీ క్లినిక్ వాక్’, తదుపరి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. మరిన్ని వివరములకు http://www.tama.org ని సందర్శించండి లేదా [email protected] కి ఇమెయిల్ పంపండి.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







