ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని టి.గవర్నర్ తమిళిసై
- August 04, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది.
ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. రెండు రోజులుగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. శుక్ర, శనివారాల్లో మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?









