'ప్రవాసి అంతిమ యాత్ర' - ప్రాజెక్టుకు దాతలు సహకరించండి
- May 16, 2016
విదేశాలలో మరణించిన తెలంగాణ ప్రవాసీల శవాలను స్వదేశానికి తెప్పించుటకు మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ లో ఒక 'హెల్ప్ లైన్' ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.
గల్ఫ్ లోని ఆరుదేశాలలో సుమారు 10 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రవాసులు సంవత్సరానికి సుమారు 200 మందికి పైగా విదేశాలలో చనిపోతున్నారని ఒక అంచనా. గల్ఫ్ తదితర దేశాల నుండి రెండు రోజులకు ఒకశవం హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు దిగుమతి అవుతున్నది.
శవాలను తెప్పించడానికి కుటుంబ సభ్యులు ఏయే పత్రాలను పంపాలి ? ఇండియన్ ఎంబసీలతో ఎలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి ? అనే విషయాలతోపాటు విదేశాల నుండి హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు శవపేటిక వచ్చినంక వారి స్వగ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉచిత అంబులెన్సు సౌకర్యం పొందే విషయంలో మృతుల కుటుంబాలకు ఈ 'హెల్ప్ లైన్' సహాయం చేస్తుంది.
వివరాలకు సంప్రదించండి వాట్సప్ +91 98494 22622

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







