ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ ఎయిర్పోర్టు విజ్ఞప్తి
- August 05, 2023
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికుల వెంట వచ్చి, వారికి స్వాగతం, వీడ్కోలు పలికే వారికి హైదరాబాద్ విమానాశ్రయం ఓ విజ్ఞప్తి చేసింది.
ప్రయాణికుల కోసం వచ్చే వారి స్నేహితులు, బంధువుల వల్ల విమానాశ్రయం ప్రాంతంలో పార్కింగ్ స్థలంతో పాటు ఇతర పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఫారన్ వెళ్తున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఇటీవల వారి వల్ల విమానాశ్రయం ప్రాంతంలో రద్దీ పెరిగిందని చెప్పింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, వారి బంధుమిత్రులు పరిమితంగా రావాలని విజ్ఞప్తి చేసింది. కాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువ కావడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.
Traffic Advisory!#FlyHYD #HYDAirport #Advisory #TrafficAdvisory #Passenger #AirportSecurity pic.twitter.com/hluKwd4F14
— RGIA Hyderabad (@RGIAHyd) August 4, 2023
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







