ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ ఎయిర్పోర్టు విజ్ఞప్తి
- August 05, 2023
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికుల వెంట వచ్చి, వారికి స్వాగతం, వీడ్కోలు పలికే వారికి హైదరాబాద్ విమానాశ్రయం ఓ విజ్ఞప్తి చేసింది.
ప్రయాణికుల కోసం వచ్చే వారి స్నేహితులు, బంధువుల వల్ల విమానాశ్రయం ప్రాంతంలో పార్కింగ్ స్థలంతో పాటు ఇతర పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఫారన్ వెళ్తున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఇటీవల వారి వల్ల విమానాశ్రయం ప్రాంతంలో రద్దీ పెరిగిందని చెప్పింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, వారి బంధుమిత్రులు పరిమితంగా రావాలని విజ్ఞప్తి చేసింది. కాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువ కావడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.
Traffic Advisory!#FlyHYD #HYDAirport #Advisory #TrafficAdvisory #Passenger #AirportSecurity pic.twitter.com/hluKwd4F14
— RGIA Hyderabad (@RGIAHyd) August 4, 2023
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







