శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమ బంగారం పట్టివేత..
- August 06, 2023
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు ఎంత నిఘాపెట్టినా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. విదేశాల నుంచి వచ్చే వారు అక్రమ పద్దతుల్లో గోల్డ్ను తీసుకుని వస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. అయితే, అక్రమంగా బంగారాన్ని తలిస్తున్న వారికి కస్టమ్స్ అధికారులు చెక్ పెడుతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇండిగో విమానంలో జెడ్డా నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. వారి వద్ద రూ. కోటి విలువైన అక్రమ బంగారాన్ని గుర్తించారు.
ప్రయాణికుల వద్ద ఫోర్ టేబుల్ స్పీకర్స్, ఐరన్ బాక్స్లో 1.88 కిలోల అక్రమ బంగారంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







