అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
- August 06, 2023
అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ లలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్కృతి, వారసత్వం నిర్మాణానికి అనుగుణంగా ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.
27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం మొత్తం రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఆదివారం వీటికి మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త మెరుగు సూచికల ఏర్పాటు, ఆధునిక మౌళిక వస్తువుల కల్పనకు నిధులు కేటాయించారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
తెలంగాణలో రూ.894 కోట్లతో రైల్వే ఆధునీకరణ పనులను మోదీ ప్రారంభించారు. ఇక ఏపీలో తొలి విడతగా 18 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏపీలో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. వీటిలో ఏపీలోని కర్నూలు, తుని, తెనాలి, అనకాపల్లి, తాడిపల్లి వంటి రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







