పార్లమెంట్: అవిశ్వాస తీర్మానంపై చర్చ..
- August 08, 2023
న్యూఢిల్లీ: నేటి పార్లమెంటు సమావేశాలు అట్టుడకబోతున్నాయి. మోడీ ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ ప్రారంభం కాబోతోంది. రెండు రోజుల చర్చ తర్వాత ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. విపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యలో ఈరోజు బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశమయింది. సభలో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై బిజెపి ఎంపీలకు ఈ సమావేశంలో మార్గనిర్దేశం చేశారు. మరోవైపు సభలో బిజెపికి ఎక్కువ మెజార్టీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఎట్టి పరిస్థితుల్లో గట్టెక్కే అవకాశమే లేదు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే, ఆయన ఈ అంశంపై సభలో మోడీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో, కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర తరపున ఐదుగురు మంత్రులు మాట్లాడతారు. వీరిలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు ఎంపీలు చర్చలో పాల్గొంటారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎన్డీయేకు బిజు జనతాదళ్, వైఎస్ఆర్సిపిలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఎన్డీయే సంఖ్యా బలం మరింత పెరిగింది. ఈ రెండు పార్టీలకు 34 మంది ఎంపీలు ఉండటం గమనార్హం. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ సభకు గైర్హాజరు కానున్నారు. ప్రధాని లేకుండానే చర్చ జరగబోతోంది.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







