ఎమిరాటీస్ నుండి Dh2.32 మిలియన్ల రికవరీ
- August 10, 2023
యూఏఈ: ప్రైవేట్ రంగంలో కల్పిత ఉద్యోగాలను అంగీకరించిన 107 యూఏఈ పౌరుల నుండి మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) Dh2.32 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన ఆర్థిక సహాయాన్ని రికవరీ చేసింది. ఈ ఎమిరాటీలు Nafis ప్రోగ్రామ్ కింద ప్రైవేట్ రంగంలో ఫేక్ ఉద్యోగాలను పొందారు. "మా సిస్టమ్లు నిజమైన ఉద్యోగాలలో ఎమిరాటీలను నియమించుకోవడంలో కంపెనీల సమ్మతిని ట్రాక్ చేస్తాయి. వేతన రక్షణ వ్యవస్థ (WPS) ద్వారా యూఏఈలోని మంత్రిత్వ శాఖ, పెన్షన్ ఫండ్ల ద్వారా వారికి జీతాలు చెల్లిస్తాయి" అని మోహ్రే తెలిపింది. చట్టం ప్రకారం.. యూఏఈలోని కంపెనీలు ప్రతి సంవత్సరం నైపుణ్యం కలిగిన పాత్రలలో 2 శాతం ఎమిరాటీలను చేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఎమిరాటైజేషన్ను పెంచడానికి ఆర్థిక మద్దతు, ప్రయోజనాలను నఫీస్(Nafis) అందిస్తుంది. యూఏఈ పౌరులు నకిలీ ఎమిరేటైజేషన్ ఉద్యోగాల ద్వారా మోసపోవద్దని మోహ్రే కోరింది. 600590000 లేదా మంత్రిత్వ శాఖ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని నివాసితులను కోరింది. జూలై నెలలో నకిలీ ఎమిరేటైజేషన్కు సంబంధించిన 436 కంపెనీలపై జరిమానాలు, పరిపాలనా ఆంక్షలను మంత్రిత్వ శాఖ విధించింది.
తాజా వార్తలు
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!







