దుబాయ్కి చేరుకున్న భారత యుద్ధనౌకలు
- August 10, 2023
దుబాయ్: ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్ (FOCWF) రియర్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ ఆధ్వర్యంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ త్రిఖండ్ అనే రెండు నౌకలు దుబాయ్లోని పోర్ట్ రషీద్కు చేరుకున్నాయి. ఇవి 'జాయెద్ తల్వార్' పేరుతో నిర్వహించే ద్వైపాక్షిక ఎక్సర్ సైజుల్లో పాల్గొననున్నాయి. ఈ రెండు నౌకలు ఆగస్టు 8 నుండి ఆగస్టు 11 వరకు పోర్ట్ రషీద్ను సందర్శిస్తాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి మరియు సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తమ పద్ధతులను షేర్ చేసుకుంటాయని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ పర్యటన రెండు నౌకాదళాల మధ్య సముద్ర భాగస్వామ్యాన్ని పెంచుతుందన్నారు.
ఇదిలా ఉండగా.. 1972లో ఇండియా, యూఏఈ దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. యూఏఈ తన రాయబార కార్యాలయాన్ని 1972లో ఢిల్లీలో ప్రారంభించింది. అయితే భారతదేశం 1973లో అబుధాబిలో తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







