మే చివరికి రానున్న 'ఒక్క అమ్మాయి తప్ప
- May 17, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు రవి కిషన్ విలన్ పాత్రను పోషించారు. బి. అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్ విశేషాలను తెలుపుతానని సందీప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రేవతి, అలి, అజయ్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









