మే చివరికి రానున్న 'ఒక్క అమ్మాయి తప్ప

- May 17, 2016 , by Maagulf
మే చివరికి రానున్న 'ఒక్క అమ్మాయి తప్ప

 సందీప్‌ కిషన్‌, నిత్యా మేనన్‌ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్‌ కిషన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు రవి కిషన్‌ విలన్‌ పాత్రను పోషించారు. బి. అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్‌ విశేషాలను తెలుపుతానని సందీప్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. రేవతి, అలి, అజయ్‌, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com