హవాయి దీవుల్లో కార్చిచ్చు.. 67కు చేరిన మృతుల సంఖ్య
- August 12, 2023
న్యూయార్క్: అమెరికాలోని హవాయి దీవుల్లో సంభవించిన కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 67కు చేరుకున్నది. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద జాతీయ విపత్తుగా నిలిచింది. ఇంకా వందల సంఖ్యలో జనం మిస్సైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. లహైనా పట్టణం దాదాపు చాలా వరకు కాలిపోయింది. అయితే ప్రజలు శుక్రవారం మళ్లీ ఆ పట్టణానికి రావడం ప్రారంభించారు. రాత్రి పూట ఆ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కేవలం సెర్చ్, రెస్క్యూ బృందాలను మాత్రమే అనుమతిస్తున్నారు. లహైనాకు ఇంకా నీటి, విద్యుత్తు సరఫరా జరగడం లేదు. మంటల్లో అన్నీ కోల్పోయిన బాధితుల కోసం అన్వేషణ జరుగుతోంది. పట్టణంలో ఉన్న హార్బర్ వద్ద నీటిలో దాచుకున్న 17 మందిని ప్రాణాలతో రక్షించారు. కార్చిచ్చు వల్ల లహైనా పట్టణంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







