హవాయి దీవుల్లో కార్చిచ్చు.. 67కు చేరిన మృతుల సంఖ్య
- August 12, 2023
న్యూయార్క్: అమెరికాలోని హవాయి దీవుల్లో సంభవించిన కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 67కు చేరుకున్నది. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద జాతీయ విపత్తుగా నిలిచింది. ఇంకా వందల సంఖ్యలో జనం మిస్సైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. లహైనా పట్టణం దాదాపు చాలా వరకు కాలిపోయింది. అయితే ప్రజలు శుక్రవారం మళ్లీ ఆ పట్టణానికి రావడం ప్రారంభించారు. రాత్రి పూట ఆ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కేవలం సెర్చ్, రెస్క్యూ బృందాలను మాత్రమే అనుమతిస్తున్నారు. లహైనాకు ఇంకా నీటి, విద్యుత్తు సరఫరా జరగడం లేదు. మంటల్లో అన్నీ కోల్పోయిన బాధితుల కోసం అన్వేషణ జరుగుతోంది. పట్టణంలో ఉన్న హార్బర్ వద్ద నీటిలో దాచుకున్న 17 మందిని ప్రాణాలతో రక్షించారు. కార్చిచ్చు వల్ల లహైనా పట్టణంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









