భారతీయులకు హిందీలో శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహ్మద్
- August 15, 2023
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హిందీలో ట్వీట్ చేశారు. “భారతదేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. భారత నాయకత్వానికి మరియు ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. భారత్ లో తమ భాగస్వామ్యం కొనసాగుతుంది. తమ మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు పెంచడానికి మరియు రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాల పెంపునకు తాము నిబద్ధతో కృషి చేస్తున్నాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .’’ అని షేక్ మహ్మద్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
आज जब भारत अपना 77वा स्वतंत्रता दिवस मना रहा है, मैं इस महान राष्ट्र का नेतृत्व करने वालों और इसके लोगों को बधाई देता हूँ। इस खुशी के अवसर पर, संयुक्त अरब अमीरात (UAE) भारत के साथ अपनी साझा समृद्धि और विकासशील भविष्य के निर्माण की प्रतिबद्धता की पुष्टि करता है, अपनी इस साझेदारी…
— HH Sheikh Mohammed (@HHShkMohd) August 15, 2023
ఇదిలా ఉండగా.. దుబాయ్లో ఈరోజు ఉదయం 6.30 గంటల నుండే భారతీయ కాన్సులేట్ వెలుపల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్కు భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ రామ్కుమార్ తంగరాజ్ జెండా ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు.
ఇండియన్ సోషల్ క్లబ్ ఫుజైరాలో కాన్సులర్ సర్వీసెస్ వైస్ కాన్సుల్ అమ్రేష్ కుమార్ జెండాను ఎగురవేశారు. రస్ అల్ ఖైమాలోని ఇండియన్ రిలీఫ్ కమిటీలో పాస్పోర్ట్ కాన్సుల్ సునీల్ కుమార్ జెండాను ఎగురవేశారు. ఇండియన్ అసోసియేషన్ ఉమ్ అల్ క్వైన్లో వైస్ కాన్సల్ అకౌంట్ మరియు అడ్మిన్ మంజు అహుజా జెండాను ఎగురవేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించిన ప్రసంగించారు. ఈ సందర్భంగా మణిపూర్లో హింస, భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర, ప్రపంచ దేశాలతో భాగస్వామ్యం సహా అనేక అంశాలపై ప్రసంగించారు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







