నజ్రాన్లో భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి
- August 16, 2023
రియాద్: దక్షిణ నజ్రాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు కార్మికులు గాయపడగా.. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భవనం హబునా గవర్నరేట్ మునిసిపాలిటీకి చెందినది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోవడంపై విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించేందుకు నజ్రాన్ ప్రాంతానికి చెందిన అమీర్ ప్రిన్స్ జిలువి బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ముసేద్ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రిన్స్ జిలువి మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు క్షతగాత్రులను అవసరమైన వైద్య సంరక్షణ మరియు చికిత్స కోసం హబునా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







