నజ్రాన్లో భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి
- August 16, 2023
రియాద్: దక్షిణ నజ్రాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు కార్మికులు గాయపడగా.. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భవనం హబునా గవర్నరేట్ మునిసిపాలిటీకి చెందినది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోవడంపై విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించేందుకు నజ్రాన్ ప్రాంతానికి చెందిన అమీర్ ప్రిన్స్ జిలువి బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ముసేద్ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రిన్స్ జిలువి మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు క్షతగాత్రులను అవసరమైన వైద్య సంరక్షణ మరియు చికిత్స కోసం హబునా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







