సౌదీలో విద్యారంగ అభివృద్ధికి మెరుగైన ప్రణాళికలు

- August 17, 2023 , by Maagulf
సౌదీలో విద్యారంగ అభివృద్ధికి మెరుగైన ప్రణాళికలు

జెడ్డా: సౌదీలో విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు, అందుకు అనుగుణంగా ఉత్తమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు సౌదీ అరేబియా  మీడియా మంత్రి సల్మాన్ బిన్ యూసఫ్ బిన్ అలీ అల్-దోసరీ తెలిపారు. జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో జరిగిన వారపు క్యాబినెట్ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. అనంతరం క్యాబినెట్ లో చర్చించిన అంశాలను అల్ దోసరీ వెల్లడించారు.  కొత్త విద్యాసంవత్సరం సమీపిస్తున్నందున, క్యాబినెట్ విద్యారంగంపై సమీక్షించిందని పేర్కొన్నారు. సౌదీలో మేధో వృద్ధి మరియు నైపుణ్యాభివృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వాటి సాయంతో పరిశోధన, ఆవిష్కరణల రంగాలను ప్రోత్సాహం, వ్యక్తులను ప్రపంచ వేదికపై రాణించడానికి సన్నద్ధం చేస్తాయని పేర్కొన్నారు.  మంత్రి మండలి తాజా ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచ రంగంలో రాజకీయ మార్పులపై చర్చిందని అల్-దోసరి చెప్పారు. సౌదీ విజన్ 2030కి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో ఆర్థిక,పెట్టుబడి సంబంధాలను పెంపొందించుకోవడం ప్రాముఖ్యతను క్యాబినెట్ చర్చిందని అల్-దోసరి చెప్పారు.

భారతదేశంలో జరిగిన గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G20) 2వ అవినీతి నిరోధక మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఈ నిబద్ధత మరింత బలపడింది. మంత్రివర్గ సమావేశంలో, వారు "రియాద్ ఇనిషియేటివ్ ఫర్ ఎన్‌హాన్సింగ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కోఆపరేషన్" గురించి ప్రస్తావించారు. ఇది దాని సంబంధిత అధికార పరిధిలో గణనీయమైన మైలురాళ్లను సాధించింది. ముఖ్యంగా 90 దేశాలకు చెందిన 161కి పైగా అవినీతి నిరోధక సంస్థలు అవినీతి నిరోధక చట్ట అమలు అధికారుల (గ్లోబ్‌ఇ నెట్‌వర్క్) యొక్క గ్లోబల్ ఆపరేషనల్ నెట్‌వర్క్‌లో భాగంగా మారారని పేర్కొన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, సౌదీ సెంటర్ ఫర్ ఎకనామిక్ బిజినెస్, డెసిషన్ సపోర్ట్ సెంటర్ ముగింపు ప్రకటనలను కూడా క్యాబినెట్ ఆమోదించిందని అల్-దోసరి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com