స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమానులు. ముగ్గురు అరెస్ట్
- August 20, 2023
సౌదీ: ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా పిచ్పైకి వచ్చి హల్చల్ చేసిన ముగ్గురు వ్యక్తులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ సమన్వయంతో స్టేడియంలోని పిచ్లోకి ప్రవేశించిన ముగ్గరిని అరెస్టు చేసినట్లు రియాద్ పోలీసు అధికారిక ప్రతినిధి తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, ఆపై వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు అధికారిక ప్రతినిధి ధృవీకరించారు.
సౌదీ ప్రొఫెషనల్ లీగ్ రెండో రౌండ్ కార్యకలాపాల్లో భాగంగా శుక్రవారం జరిగిన అల్ నాసర్ మరియు అల్ తావౌన్ మ్యాచ్లో అలవ్వాల్ పార్క్ స్టేడియంలోని పిచ్పైకి ముగ్గురు వ్యక్తులు దూసుకొచ్చి హల్చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ సంఘటన తరువాత సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అధికారులు మ్యాచ్ల సమయంలో నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని క్రీడాభిమానులకు సూచించారు.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







