అంతరిక్ష రంగంలో భారత్ చారిత్రాత్మక విజయం
- August 24, 2023
కువైట్: చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత అవతరించింది. చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం చంద్రుని ఉపతరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్, ఆపై లునార్ మూన్ పై కాలుమోపడం చకచకా వియవంతంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఈ చారిత్రాత్మక విజయం మొత్తం మానవాళికి ఉపయోగపడుతుందని, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఈ ఘనత చిరస్మరణీయమని తన సందేశంలో హిస్ హైనెస్ అమీర్ పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కువైట్ క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైనందుకు అభినందనలు తెలుపుతూ కేబుల్ పంపారు. కువైట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా ఈ అద్భుతమైన విజయానికి భారతదేశాన్ని అభినందిస్తూ భారత ప్రధానికి అభినందన సందేశాన్ని పంపారు.
తాజా వార్తలు
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక







