అంతరిక్ష రంగంలో భారత్ చారిత్రాత్మక విజయం
- August 24, 2023
కువైట్: చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత అవతరించింది. చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం చంద్రుని ఉపతరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్, ఆపై లునార్ మూన్ పై కాలుమోపడం చకచకా వియవంతంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఈ చారిత్రాత్మక విజయం మొత్తం మానవాళికి ఉపయోగపడుతుందని, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఈ ఘనత చిరస్మరణీయమని తన సందేశంలో హిస్ హైనెస్ అమీర్ పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కువైట్ క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైనందుకు అభినందనలు తెలుపుతూ కేబుల్ పంపారు. కువైట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా ఈ అద్భుతమైన విజయానికి భారతదేశాన్ని అభినందిస్తూ భారత ప్రధానికి అభినందన సందేశాన్ని పంపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







