వాహనదారుల ఉల్లంఘనల నమోదుకు ఆగస్ట్ 27 నుంచి కొత్త సిస్టమ్
- August 24, 2023
దోహా: వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలకు జరిమానాల సందేశాలను నేరుగా అందుకోనున్నారు. ఈ తరహా ఉల్లంఘనలు ఆగస్ట్ 27 నుండి కొత్త సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయి. కొత్త నిర్ణయం రెండు దశల్లో అమలు చేయబడుతుంది. మొదటి దశ ఆగష్టు 27 నుండి సెప్టెంబర్ 2 వరకు ప్రారంభమవుతుంది. అప్పుడు వాహనదారులు ఉల్లంఘన సందేశాన్ని అందుకుంటారు. అది జరిమానా కాదని రాడార్ మరియు స్కేల్స్ విభాగం అధిపతి ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ మేజర్ హమద్ అలీ అల్ ముహన్నడి చెప్పారు.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సెప్టెంబర్ 3 నుండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం ఆటోమేటెడ్ మానిటరింగ్ను ప్రారంభిస్తుందని తెలిపారు. అయితే, అవగాహన సమయంలో వచ్చేది అవగాహన సందేశమని, అది జరమానా కాదని గుర్తుచేశారు. రెండవ దశ సెప్టెంబర్ 3 న ప్రారంభమవుతుంది. అప్పుడు ఉల్లంఘన టిక్కెట్ల జారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అల్ ముహన్నాది చెప్పారు. జరిమానా గురించి మాట్లాడుతూ.. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ నెం. 54 ప్రకారం వాహనదారుల దృష్టిని మళ్లించేలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ లేదా ఏదైనా ఇతర (విజువల్ టూల్స్) ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం ద్వారా QR500 జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









