తుఫాన్ హెచ్చరిక..!! అప్రమత్తం..!!

- May 18, 2016 , by Maagulf
తుఫాన్ హెచ్చరిక..!! అప్రమత్తం..!!

మరో రెండు గంటల్లో రోనో తుఫాన్ గా మారనున్న వాయుగండం. మచిలీపట్నంకు 170కి.మీ దూరంలో కేంద్రీకృతం. బుధవారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లో ఈదురు గాలుల భీభత్సం, భారీ వర్షం. మచిలీపట్నంలో 15 సెం.మీ పైగా వర్షపాతం నమోదు. మంగినపూడి బీచ్ వద్ద ఎగసి పడుతున్న అలలు. రాత్రి నుంచి విద్యుత్ కు అంతరాయం. ఇబ్బంది పడుతున్న ప్రజలు. బందరు నియోజకవర్గంలోని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన విపత్తుల రక్షణ బృందాలు. మరో 48 గంటల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది . తీరం దాటే సమయంలో గంటకు90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలిలు వీస్తాయని వాథావరణశఖ హెచ్చరిక జారీ చేసింది . తుఫాన్ కు ముందే భీభత్సమైన గాలులు వీస్తుండటంతో భయోంధనళ లో మచిలీపట్టణం వాసులు. నిన్నటి నుండి కరెంటు లేకపోవడంతో ఇన్వెర్టర్ లు చార్జింగ్ అయిపోయింది. మొబైల్ ఫోన్లలలో చార్జింగ్ లేకపోవడంతో తమ తమ వారితో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. సామాజిక మీడియా ద్వారా తుపాను పరిస్థితిని కొంత మేర సమాచారం తెల్సుకొంటున్నారు. మచిలీపట్నంకు చెందిన " బందరు బంధువులు " 13 వేల మంది సభ్యులు ఉన్న పేస్ బుక్ గ్రూప్ తుపాను సమాచారం అందరకి తెలియచేస్తున్నారు వర్షం,గాలి ఉధృతి పెరిగింది. కారు మబ్బులు తో పగలే చీకట్లు కమ్ముకున్నాయి. మరి ఈ తుపాను పయనం ఎటో..ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో ?? మే-19 వాతావరణం చూస్తుంటే 1977 నవంబర్ 19 వ తేదీ భయం ప్రజలను వెంటాడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com