జూన్‌ 15 నుంచి మిడ్‌ డే డ్రేక్‌

- May 19, 2016 , by Maagulf
జూన్‌ 15 నుంచి మిడ్‌ డే డ్రేక్‌

జూన్‌ 15 నుంచి మిడ్‌ డే బ్రేక్‌ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు మూడు నెలలపాటు ఈ మిడ్‌ డే బ్రేక్‌ ఉంటుంది. నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలు 5,000 దిర్హామ్‌లు ఒక్కో వర్కర్‌కీ జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఈ జరిమానా 50,000 దిర్హాహ్‌లు. కంపెనీని డీగ్రేడ్‌ చేయడం, తాత్కాలికంగా ఆపరేషన్స్‌ నిలిపివేయడం వంటి కఠిన చర్యలూ తీసుకోబడ్తాయి కంపెనీలపైన. వేసవి కాలం ఎండ తీవ్రత కారణంగా మినిస్ట్రీ గత 11 ఏళ్ళుగా ఈ మిడ్‌ డే బ్రేక్‌ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఇది 12వ సంవత్సరం. అత్యవసర పనుల నిమిత్తం బ్రేక్‌ లేకుండా పనులు చేయించాల్సి వస్తే, యజమాని కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలనీ, ఎండ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయనివ్వరాదనీ స్పష్టమైన ఆదేశాలున్నాయి. గత సంవత్సరం 65,000 ఇన్‌స్పెక్షన్స్‌ జరిగాయి. కేవలం 58 నిబంధనల ఉల్లంఘనలు మాత్రమే చోటుచేసుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com