అక్టోబర్లో ‘AI రీషేపింగ్ ఇండస్ట్రీస్’ ఫోరమ్
- September 02, 2023
బహ్రెయిన్: 10వ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఇ-గవర్నమెంట్ ఫోరమ్ అక్టోబర్ 9 నుండి 11 వరకు గ్రాండ్ హాల్లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లో జరగనుంది. ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమం అంతర్గత వ్యవహారాల మంత్రి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (MCICT) మంత్రిత్వ కమిటీ ఛైర్మన్ అయిన జనరల్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో జరుగనుంది. ఫోరమ్ 'AI: రీషేపింగ్ ఇండస్ట్రీస్' థీమ్ తో నిర్వహించనున్నారు. ఫోరమ్ లో కృత్రిమ మేధస్సు అధునాతన సాంకేతికతలలో ముందంజలో ఎలా నిలుస్తుంది, పురోగతిని వేగవంతం చేయడంలో, ఆవిష్కరణలను ప్రేరేపించడంలో మరియు విభిన్న రంగాలలో వృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర ఎలా పోషిస్తుందన్న విషయాలపై చర్చలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో AI మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)లో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







