సెప్టెంబర్ 10న భారత్, పాక్ మ్యాచ్..
- September 06, 2023
కొలంబో: ఆసియాకప్ 2023లో మ్యాచులకు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. పలు మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించడంతో డక్త్ లూయిస్ పద్దతిలో మ్యాచులను నిర్వహించారు. అయితే.. ఇంకొన్ని మ్యాచులు రద్దు అయ్యాయి. అందులో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన భారత్, పాక్ మ్యాచ్ ఒకటి. దీంతో వేదికలను మార్చాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
ఆసియా కప్2023లో గ్రూప్ స్టేజీ ముగిసింది. నేటి నుంచి సూపర్-4 దశ మొదలైంది. అయితే.. సూపర్-4లో మ్యాచులు జరగనున్న కొలంబోలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ లు సెప్టెంబర్ 10న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అవుతుందేమోనని భయాందోళనలు వ్యక్తం అవుతుండగా శ్రీలంక వాతావరణశాఖ అధికారి ఒకరు ఫ్యాన్స్కు శుభవార్త చెప్పారు.
శ్రీలంక వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల కరుణానాయక్ మాట్లాడుతూ టోర్నీ ఆఖరి దశలో మ్యాచులకు వర్షం ముప్పు తక్కువేనని చెప్పారు. సెప్టెంబర్ 9 తరువాత కొలంబోలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఒక వేళ వర్షం పడినా చిరుజల్లులు మాత్రమే పడతాయన్నారు. ఆయన చెబుతున్న దాన్ని బట్టి చూస్తే సెప్టెంబర్ 10న దాయాదుల మధ్య పోరు సజావుగా సాగే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్కు సైతం కొలంబోనే ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 10న పాకిస్తాన్తో తలపడనున్న భారత్, ఆ తరువాత సెప్టెంబర్ 12న శ్రీలంకతో, సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్తో మ్యాచులు ఆడనుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









