ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ప్రయాణీకుడు మృతి
- September 12, 2023
న్యూఢిల్లీ: ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ఓ ప్రయాణీకుడు మృతి చెందారు. మృతుడిని K ధనశేఖరన్ (38)గా గుర్తించారు. ఆయన మస్కట్ నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా విమానం గాలిలో ఉండగానే గుండెపోటుతో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మస్కట్లో పని చేస్తున్న ధనశేఖరన్ సెలవుల కోసం ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత, మిగతా ప్రయాణికులందరూ విమానం నుంచి దిగిన తర్వాత కూడా ధనశేఖరన్ అలాగే కూర్చున్నట్లు ప్లైట్ సిబ్బంది గుర్తించారు. అతను నిద్రపోతున్నాడని భావించిన క్యాబిన్ సిబ్బంది అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది అతడిని తనిఖీ చేయగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతరం పరిస్థితిని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. విమానాశ్రయంలోని అత్యవసర వైద్య కేంద్రానికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









