ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ప్రయాణీకుడు మృతి
- September 12, 2023
న్యూఢిల్లీ: ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ఓ ప్రయాణీకుడు మృతి చెందారు. మృతుడిని K ధనశేఖరన్ (38)గా గుర్తించారు. ఆయన మస్కట్ నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా విమానం గాలిలో ఉండగానే గుండెపోటుతో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మస్కట్లో పని చేస్తున్న ధనశేఖరన్ సెలవుల కోసం ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత, మిగతా ప్రయాణికులందరూ విమానం నుంచి దిగిన తర్వాత కూడా ధనశేఖరన్ అలాగే కూర్చున్నట్లు ప్లైట్ సిబ్బంది గుర్తించారు. అతను నిద్రపోతున్నాడని భావించిన క్యాబిన్ సిబ్బంది అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది అతడిని తనిఖీ చేయగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతరం పరిస్థితిని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. విమానాశ్రయంలోని అత్యవసర వైద్య కేంద్రానికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







