ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ప్రయాణీకుడు మృతి
- September 12, 2023
న్యూఢిల్లీ: ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ఓ ప్రయాణీకుడు మృతి చెందారు. మృతుడిని K ధనశేఖరన్ (38)గా గుర్తించారు. ఆయన మస్కట్ నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా విమానం గాలిలో ఉండగానే గుండెపోటుతో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మస్కట్లో పని చేస్తున్న ధనశేఖరన్ సెలవుల కోసం ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత, మిగతా ప్రయాణికులందరూ విమానం నుంచి దిగిన తర్వాత కూడా ధనశేఖరన్ అలాగే కూర్చున్నట్లు ప్లైట్ సిబ్బంది గుర్తించారు. అతను నిద్రపోతున్నాడని భావించిన క్యాబిన్ సిబ్బంది అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది అతడిని తనిఖీ చేయగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతరం పరిస్థితిని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. విమానాశ్రయంలోని అత్యవసర వైద్య కేంద్రానికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







