తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పై మంత్రి కెటిఆర్ కీలక వ్యాఖ్యలు
- September 12, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అక్టోబర్ 10వ తేదీ లోపు నోటిఫికేషన్ వస్తేనే నిర్ణీత సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఈ లోగా నోటిఫికేషన్ రావడం అనుమానమే అన్నారు. అలా జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకునే నిర్ణయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ఖర్చు, ప్రజలకు ఇబ్బంది తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా జమిలి ఎన్నికల వైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో కెటిఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







