క్రౌన్ ప్రిన్స్ భారతదేశ పర్యటనపై కేబినెట్ ప్రశంసలు
- September 13, 2023
నియోమ్: NEOMలో మంగళవారం రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశమైంది.ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ జీ20 సమావేశం సందర్భంగా భారతదేశ పర్యటన సత్ఫలితాలు ఇచ్చిందని కేబినెట్ ప్రశంసలు కురిపించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిపిన చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా G20 లీడర్స్ సమ్మిట్లో క్రౌన్ ప్రిన్స్ ప్రసంగం సౌదీ లక్ష్యాత్మక నిర్ణయాలను ప్రపంచం ముందు పెట్టిందన్నారు. G20 సభ్య దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మధ్య సహకారాన్ని పెంచుతుందని భావిస్తున్న నిర్ణయాలను కేబినెట్ ప్రశంసించింది.
అనంతరం మీడియా మంత్రి సల్మాన్ బిన్ యూసఫ్ అల్-దోసరీ మాట్లాడుతూ.. భారతదేశం, మధ్యప్రాచ్యం, యూరప్లను కలుపుతూ ఆర్థిక కారిడార్ ఏర్పాటును స్వాగతించనున్నట్లు పేర్కొన్నారు. ఆసియాను యూరప్తో అనుసంధానించే రాజ్యం గుండా వెళుతున్న ఖండాంతర గ్రీన్ ట్రాన్సిట్ కారిడార్ల ఏర్పాటుకు ప్రోటోకాల్ను అభివృద్ధి చేయడంలో సహకారంతో సౌదీ అరేబియా యునైటెడ్ స్టేట్స్తో సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని కూడా మంత్రివర్గం చర్చించిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







