మోడీ ప్రభుత్వం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
- September 13, 2023
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధాని మోడీ చేస్తోంది కరక్టేనంటూ కితాబిచ్చారు. రష్యాలో జరిగిన 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని ప్రస్తావించారు. రష్యాలో తయారైన కార్లనే రష్యన్లు వినియోగించాలని పుతిన్ సూచించారు. దేశీ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి మోడీ ఇప్పటికే తన విధానాల ద్వారా గొప్ప ఉదాహరణలు నెలకొల్పారని ఫోరమ్ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగించారు.
‘‘గతంలో రష్యాలో తయారైన కార్లు మనకు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఉన్నాయి. అవి చూడటానికి కాస్తంత సాధారణంగా కనిపించొచ్చు. ఆడీ, బెంజ్ కార్లలా ఉండకపోవచ్చు. కానీ దీన్నో సమస్యగా చూడకూడదు. మనం ఇండియా లాంటి దేశాలు అవలంబిస్తున్న విధానాలను పాటించాలి. దేశీయంగా వాహనాలు తయారు చేయడంపై వారు దృష్టి పెట్టారు. మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రధాని మోడీ సరైన పనే చేస్తున్నారనేది నా అభిప్రాయం’’ అని పుతిన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







