యూఏఈ-ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' విధానానికి ఫ్లైదుబాయ్ సీఈఓ పిలుపు
- September 21, 2023
యూఏఈ: దుబాయ్కి చెందిన క్యారియర్ ఫ్లైదుబాయ్ సీఈఓ ఘైత్ అల్ ఘైత్.. యూఏఈ, ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' పాలసీకి పిలుపునిచ్చారు. ఈ ఏర్పాటు రెండు దేశాలలో పర్యాటకాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి ఓ మీడియాలో మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లైదుబాయ్ ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబరు మధ్య వరకు నాలుగు మిలియన్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించినట్లు తెలిపారు. భారతదేశం పెద్ద మార్కెట్ అని, ఇప్పుడు యూఏఈ, భారతదేశం మధ్య వాణిజ్య కారిడార్ ఉన్నందున, విమానయాన రంగాన్ని కూడా సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. 'ఓపెన్ స్కైస్' ఒప్పందం అనేది విదేశీ విమానయాన సంస్థలకు జాతీయ విమానాశ్రయాలకు యాక్సెస్ మంజూరు చేయడం. ఇది ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు, సీట్లు మరియు నగరాలకు విమానయాన సంస్థలు సేవలందించే పరిమితులను తొలగిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









