యూఏఈ-ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' విధానానికి ఫ్లైదుబాయ్ సీఈఓ పిలుపు
- September 21, 2023
యూఏఈ: దుబాయ్కి చెందిన క్యారియర్ ఫ్లైదుబాయ్ సీఈఓ ఘైత్ అల్ ఘైత్.. యూఏఈ, ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' పాలసీకి పిలుపునిచ్చారు. ఈ ఏర్పాటు రెండు దేశాలలో పర్యాటకాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి ఓ మీడియాలో మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లైదుబాయ్ ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబరు మధ్య వరకు నాలుగు మిలియన్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించినట్లు తెలిపారు. భారతదేశం పెద్ద మార్కెట్ అని, ఇప్పుడు యూఏఈ, భారతదేశం మధ్య వాణిజ్య కారిడార్ ఉన్నందున, విమానయాన రంగాన్ని కూడా సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. 'ఓపెన్ స్కైస్' ఒప్పందం అనేది విదేశీ విమానయాన సంస్థలకు జాతీయ విమానాశ్రయాలకు యాక్సెస్ మంజూరు చేయడం. ఇది ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు, సీట్లు మరియు నగరాలకు విమానయాన సంస్థలు సేవలందించే పరిమితులను తొలగిస్తుంది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







