యూఏఈ-ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' విధానానికి ఫ్లైదుబాయ్ సీఈఓ పిలుపు
- September 21, 2023
యూఏఈ: దుబాయ్కి చెందిన క్యారియర్ ఫ్లైదుబాయ్ సీఈఓ ఘైత్ అల్ ఘైత్.. యూఏఈ, ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' పాలసీకి పిలుపునిచ్చారు. ఈ ఏర్పాటు రెండు దేశాలలో పర్యాటకాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి ఓ మీడియాలో మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లైదుబాయ్ ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబరు మధ్య వరకు నాలుగు మిలియన్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించినట్లు తెలిపారు. భారతదేశం పెద్ద మార్కెట్ అని, ఇప్పుడు యూఏఈ, భారతదేశం మధ్య వాణిజ్య కారిడార్ ఉన్నందున, విమానయాన రంగాన్ని కూడా సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. 'ఓపెన్ స్కైస్' ఒప్పందం అనేది విదేశీ విమానయాన సంస్థలకు జాతీయ విమానాశ్రయాలకు యాక్సెస్ మంజూరు చేయడం. ఇది ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు, సీట్లు మరియు నగరాలకు విమానయాన సంస్థలు సేవలందించే పరిమితులను తొలగిస్తుంది.
తాజా వార్తలు
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!









