యూఏఈ-ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' విధానానికి ఫ్లైదుబాయ్ సీఈఓ పిలుపు

- September 21, 2023 , by Maagulf
యూఏఈ-ఇండియా మధ్య \'ఓపెన్ స్కైస్\' విధానానికి ఫ్లైదుబాయ్ సీఈఓ పిలుపు

యూఏఈ: దుబాయ్‌కి చెందిన క్యారియర్ ఫ్లైదుబాయ్ సీఈఓ ఘైత్ అల్ ఘైత్.. యూఏఈ, ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' పాలసీకి పిలుపునిచ్చారు. ఈ ఏర్పాటు రెండు దేశాలలో పర్యాటకాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి ఓ మీడియాలో మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లైదుబాయ్ ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబరు మధ్య వరకు నాలుగు మిలియన్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించినట్లు తెలిపారు. భారతదేశం పెద్ద మార్కెట్ అని, ఇప్పుడు యూఏఈ, భారతదేశం మధ్య వాణిజ్య కారిడార్ ఉన్నందున, విమానయాన రంగాన్ని కూడా సరళీకృతం చేయాలని ఆయన సూచించారు.  'ఓపెన్ స్కైస్' ఒప్పందం అనేది విదేశీ విమానయాన సంస్థలకు జాతీయ విమానాశ్రయాలకు యాక్సెస్ మంజూరు చేయడం. ఇది ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు, సీట్లు మరియు నగరాలకు విమానయాన సంస్థలు సేవలందించే పరిమితులను తొలగిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com