దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున తేలియాడే మస్జీదు
- September 22, 2023
యూఏఈ: దుబాయ్ 55 మిలియన్ దిర్హామ్లతో నీటి అడుగున తేలియాడే మసీదు కోసం ప్రణాళికలను ప్రకటించింది. ప్రపంచంలోని మొట్టమొదటి నిర్మాణం మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. నీటి అడుగున డెక్ ప్రార్థనా స్థలంగా ఉపయోగించబడుతుంది. దాదాపు 50-75 మంది ఆరాధకులు నీటి అడుగున ప్రార్థనలు చేయవచ్చు. దుబాయ్లోని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ (IACAD) దాని మతపరమైన పర్యాటక ప్రాజెక్ట్ గురించి బ్రీఫింగ్ నిర్వహించడంతో మసీదు ప్రణాళికలను ప్రకటించారు. మస్జీదు నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపింది. అయితే, దీనిని ఎక్కడ నిర్మాణం చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు. "ఇది తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆరాధకులు ప్రధాన భూభాగానికి అనుసంధానించిన వంతెన గుండా నడవగలుగుతారు" అని IACAD ఉన్నతాధికారి అల్ మన్సూర్ చెప్పారు.కాగా, మస్జీదు ప్రతి మతానికి చెందిన వారికి తెరిచి ఉంటుందని, అయితే సందర్శకులు నిరాడంబరంగా దుస్తులు ధరించాలని అల్ మన్సూర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









