దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున తేలియాడే మస్జీదు
- September 22, 2023
యూఏఈ: దుబాయ్ 55 మిలియన్ దిర్హామ్లతో నీటి అడుగున తేలియాడే మసీదు కోసం ప్రణాళికలను ప్రకటించింది. ప్రపంచంలోని మొట్టమొదటి నిర్మాణం మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. నీటి అడుగున డెక్ ప్రార్థనా స్థలంగా ఉపయోగించబడుతుంది. దాదాపు 50-75 మంది ఆరాధకులు నీటి అడుగున ప్రార్థనలు చేయవచ్చు. దుబాయ్లోని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ (IACAD) దాని మతపరమైన పర్యాటక ప్రాజెక్ట్ గురించి బ్రీఫింగ్ నిర్వహించడంతో మసీదు ప్రణాళికలను ప్రకటించారు. మస్జీదు నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపింది. అయితే, దీనిని ఎక్కడ నిర్మాణం చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు. "ఇది తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆరాధకులు ప్రధాన భూభాగానికి అనుసంధానించిన వంతెన గుండా నడవగలుగుతారు" అని IACAD ఉన్నతాధికారి అల్ మన్సూర్ చెప్పారు.కాగా, మస్జీదు ప్రతి మతానికి చెందిన వారికి తెరిచి ఉంటుందని, అయితే సందర్శకులు నిరాడంబరంగా దుస్తులు ధరించాలని అల్ మన్సూర్ తెలిపారు.
తాజా వార్తలు
- భార్యాభర్తల కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..
- టీమ్ఇండియాకు ICC బిగ్ షాక్..
- యూపీఐ కొత్త రూల్స్..యూజర్లకు బిగ్ రిలీఫ్..
- జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్లో డ్రైవర్ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!