దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున తేలియాడే మస్జీదు
- September 22, 2023
యూఏఈ: దుబాయ్ 55 మిలియన్ దిర్హామ్లతో నీటి అడుగున తేలియాడే మసీదు కోసం ప్రణాళికలను ప్రకటించింది. ప్రపంచంలోని మొట్టమొదటి నిర్మాణం మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. నీటి అడుగున డెక్ ప్రార్థనా స్థలంగా ఉపయోగించబడుతుంది. దాదాపు 50-75 మంది ఆరాధకులు నీటి అడుగున ప్రార్థనలు చేయవచ్చు. దుబాయ్లోని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ (IACAD) దాని మతపరమైన పర్యాటక ప్రాజెక్ట్ గురించి బ్రీఫింగ్ నిర్వహించడంతో మసీదు ప్రణాళికలను ప్రకటించారు. మస్జీదు నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపింది. అయితే, దీనిని ఎక్కడ నిర్మాణం చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు. "ఇది తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆరాధకులు ప్రధాన భూభాగానికి అనుసంధానించిన వంతెన గుండా నడవగలుగుతారు" అని IACAD ఉన్నతాధికారి అల్ మన్సూర్ చెప్పారు.కాగా, మస్జీదు ప్రతి మతానికి చెందిన వారికి తెరిచి ఉంటుందని, అయితే సందర్శకులు నిరాడంబరంగా దుస్తులు ధరించాలని అల్ మన్సూర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







