దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున తేలియాడే మస్జీదు
- September 22, 2023
యూఏఈ: దుబాయ్ 55 మిలియన్ దిర్హామ్లతో నీటి అడుగున తేలియాడే మసీదు కోసం ప్రణాళికలను ప్రకటించింది. ప్రపంచంలోని మొట్టమొదటి నిర్మాణం మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. నీటి అడుగున డెక్ ప్రార్థనా స్థలంగా ఉపయోగించబడుతుంది. దాదాపు 50-75 మంది ఆరాధకులు నీటి అడుగున ప్రార్థనలు చేయవచ్చు. దుబాయ్లోని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ (IACAD) దాని మతపరమైన పర్యాటక ప్రాజెక్ట్ గురించి బ్రీఫింగ్ నిర్వహించడంతో మసీదు ప్రణాళికలను ప్రకటించారు. మస్జీదు నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపింది. అయితే, దీనిని ఎక్కడ నిర్మాణం చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు. "ఇది తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆరాధకులు ప్రధాన భూభాగానికి అనుసంధానించిన వంతెన గుండా నడవగలుగుతారు" అని IACAD ఉన్నతాధికారి అల్ మన్సూర్ చెప్పారు.కాగా, మస్జీదు ప్రతి మతానికి చెందిన వారికి తెరిచి ఉంటుందని, అయితే సందర్శకులు నిరాడంబరంగా దుస్తులు ధరించాలని అల్ మన్సూర్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







