అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టిడిపి

- September 22, 2023 , by Maagulf
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టిడిపి

అమరావతి: అధికారపక్షం తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టిడిపి నిర్ణయించింది. రేపట్నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

కాగా, స్పీకర్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను బహిష్కరించాలని టిడిపి నిర్ణయించింది. నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తు స్పీకర్ అనురిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అందుకే సభలో సరైన గౌరవం లేకపోవడంతోపాటు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకే సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com