జాబ్ లాస్ ఇన్సూరెన్స్.. నమోదు చేయకుంటే Dh400 జరిమానా
- September 24, 2023
యూఏఈ: అక్టోబర్ 1 లోపు తప్పనిసరి నిరుద్యోగ బీమా పథకానికి సైన్ అప్ చేయని అర్హతగల ఉద్యోగులపై Dh400 జరిమానా వర్తిస్తుంది. పెనాల్టీలను నివారించడానికి ఉద్యోగులందరూ ఈ పథకం కోసం నమోదు చేసుకోవాలని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) పిలుపునిచ్చింది. పరిమిత కాలానికి ఆర్థిక సహాయాన్ని అందించే తక్కువ-ధర ఉద్యోగ భద్రత నెట్కు దాదాపు 5 మిలియన్ల మంది నమోదు చేసుకున్నారు. ఉద్యోగి కనీసం 12 నెలల పాటు స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసినంత వరకు పరిహారం క్లెయిమ్ చేయవచ్చు. అతను/ఆమె రెసిడెన్సీని రద్దు చేసి దేశాన్ని విడిచిపెట్టి లేదా కొత్త ఉద్యోగంలో చేరిన సందర్భంలో బీమా చేసిన వ్యక్తి పరిహారం పొందే హక్కును కోల్పోతాడు. బీమా క్లెయిమ్ సమర్పించిన రెండు వారాల్లోపు ప్రాసెస్ చేయబడుతుందని మంత్రిత్వ శాక వెల్లడించింది. యజమానులకు తమ కార్మికులను సిస్టమ్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని, అయితే "సిస్టమ్లో నమోదు చేసుకోవడం ఉద్యోగి బాధ్యత" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ పథకం ప్రైవేట్, సమాఖ్య రంగాలలోని కార్మికులందరికీ వర్తిస్తుంది. పెట్టుబడిదారులు, గృహ కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లు, పెన్షన్ పొంది కొత్త యజమానిలో చేరిన పదవీ విరమణ చేసినవారికి మినహాయింపు ఇచ్చారు. బీమా పథకాన్ని రెండు వర్గాలుగా విభజించారు. మొదటిది Dh16,000 లేదా అంతకంటే తక్కువ ప్రాథమిక జీతం ఉన్నవారికి వర్తిస్తుంది. ఇక్కడ బీమా ప్రీమియం నెలకు Dh5గా నిర్ణయించారు. గరిష్ట నెలవారీ పరిహారం Dh10,000 అందనుంది. రెండవ వర్గం Dh16,000 కంటే ఎక్కువ ప్రాథమిక జీతం ఉన్నవారికి బీమా ప్రీమియం నెలకు Dh10గా ఉంది. ఈ వర్గానికి నెలవారీ పరిహారం Dh20,000కి పరిమితం చేశారు. ఒక ఉద్యోగి స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసి, గడువు తేదీ నుండి మూడు నెలల కంటే ఎక్కువ కాలం పాటు ప్రీమియంలను చెల్లించడంలో విఫలమైతే, బీమా సర్టిఫికేట్ రద్దు చేయబడుతుంది. Dh200 జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







