వ్యవసాయ రంగంలో 20,000 ఉద్యోగాలను సృష్టించడం యూఏఈ లక్ష్యం
- September 24, 2023
యూఏఈ: ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగాల సహకారం $10 బిలియన్లు (Dh36.7 బిలియన్లు) పెంచడం, రాబోయే ఐదేళ్లలో 20,000 ఉద్యోగాలను సృష్టించడం యూఏఈ లక్ష్యం అని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. దుబాయ్లో జరిగిన ఐదవ ఫ్యూచర్ ఫుడ్ ఫోరమ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికీకరణ ఆవిష్కరణ, యూఏఈ ఆహార సరఫరా గొలుసును పెంపొందించడం, యూఏఈని ప్రపంచ నియంత్రణ శక్తి కేంద్రంగా మార్చడం వంటి లక్ష్యాలను సాధించడానికి ఏడు కీలక అంశాల ఏజెండాను వెల్లడించారు. నిధులు, వ్యూహం, మద్దతు, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి ప్యాకేజీలను అందజేస్తామని చెప్పారు. కొత్త మార్కెట్ల ఏర్పాటు, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ పంటల విస్తిర్ణాన్ని ఏటా 5 శాతానికి పెంచడం, సగటు వ్యవసాయ ఆదాయాన్ని ఏటా 10 శాతానికి పెంచడం, ఈ రంగంలో శ్రామిక శక్తిని ఏటా 5 శాతం పెంచడం, ఉత్పత్తి యూనిట్ నీటిపారుదల కోసం ఉపయోగించే నీటిలో 15 శాతం వార్షిక తగ్గింపును సాధించడం ప్రధాన లక్ష్యాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో యూఏఈ బాగా పనిచేస్తోందని అల్ మర్రి చెప్పారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







