వ్యవసాయ రంగంలో 20,000 ఉద్యోగాలను సృష్టించడం యూఏఈ లక్ష్యం
- September 24, 2023
యూఏఈ: ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగాల సహకారం $10 బిలియన్లు (Dh36.7 బిలియన్లు) పెంచడం, రాబోయే ఐదేళ్లలో 20,000 ఉద్యోగాలను సృష్టించడం యూఏఈ లక్ష్యం అని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. దుబాయ్లో జరిగిన ఐదవ ఫ్యూచర్ ఫుడ్ ఫోరమ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికీకరణ ఆవిష్కరణ, యూఏఈ ఆహార సరఫరా గొలుసును పెంపొందించడం, యూఏఈని ప్రపంచ నియంత్రణ శక్తి కేంద్రంగా మార్చడం వంటి లక్ష్యాలను సాధించడానికి ఏడు కీలక అంశాల ఏజెండాను వెల్లడించారు. నిధులు, వ్యూహం, మద్దతు, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి ప్యాకేజీలను అందజేస్తామని చెప్పారు. కొత్త మార్కెట్ల ఏర్పాటు, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ పంటల విస్తిర్ణాన్ని ఏటా 5 శాతానికి పెంచడం, సగటు వ్యవసాయ ఆదాయాన్ని ఏటా 10 శాతానికి పెంచడం, ఈ రంగంలో శ్రామిక శక్తిని ఏటా 5 శాతం పెంచడం, ఉత్పత్తి యూనిట్ నీటిపారుదల కోసం ఉపయోగించే నీటిలో 15 శాతం వార్షిక తగ్గింపును సాధించడం ప్రధాన లక్ష్యాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో యూఏఈ బాగా పనిచేస్తోందని అల్ మర్రి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







