'నాకు మరణశిక్ష ఇవ్వండి ' : హంతకుడు బహ్రెయిన్ కోర్టుకి వినతి
- May 20, 2016
మనామా: ఒక వికారమైన సంఘటన లో, తన తోటి రూమ్మేట్ నే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న ఒక ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తికి శుక్రవారం ఉన్నత నేర న్యాయస్థానం మరణశిక్షకు ఆదేశించింది. విధించింది. 29 ఏళ్ల నిందితుడు తన రూమ్మేట్ హిందూ మతం కు చెందినవాడని, ఇస్లాం మతంని అవమానించిన నేపధ్యంలో అతనిని చంపినట్లు ఉన్నత నేర న్యాయస్థానం ఎదుట పేర్కొన్నాడు.,బాంగ్లాదేశ్ కు చెందిన ఈ నిందితుడు పదునైన కత్తిని తీసుకొని తన సహచరుడు మెడను కోసినట్లు తెలుస్తుంది, ఆ తర్వాత అనేక సార్లు కత్తితో పొడిచి మరణించేవరకు వదలలేదని ప్రాసిక్యూషన్ కధనం ఈ హత్య చేసిన తర్వాత, నిందితుడు సమీపంలోని మసీదు వద్దకు వెళ్ళి తాను తన రూమ్మేట్ ని చంపినట్లు వివరించాడు, దీంతో కొందరు భక్తులు ఈ సమాచారంను పోలీసులకు తెలిపారు. "అతను రక్తపు దుస్తులతో ఒక కత్తిని పట్టుకుని అసాధారణ రీతిలో ఉన్మాదిలా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. తాను ఒక వ్యక్తిని హత్య చేసానని అన్నాడు. కొందరు భక్తులు అతనిని నిలువరించి ఆ ఉధృతిని తగ్గించేందుకు ప్రయత్నించారని తరువాత పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు ప్రత్యక్ష సాక్షి న్యాయవాదుల ఎదుట పేర్కొని కోర్టు పత్రాలలో లిఖితపూర్వకంగా తెలిపారు
ప్రాధమిక దర్యాప్తు ప్రకారం, బాంగ్లాదేశ్ హంతకుడు ఆ సంఘటనకు ముందు పరిస్థితిని వివరించాడు. తన హిందూ రూమ్మేట్ నిరంతరంగా ఇస్లాం మతంను కించపర్చవద్ధని పలుమార్లు హెచ్చరికలు చేసి ఉన్నప్పటికీ ఇస్లాం మతంపై దిగజారుడు వాఖ్యలు ఎన్నో చెసినట్లు తెలిపాడు అందుకే తను ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పాడు .
ఈ హత్యకు సంబంధించి కోర్టు ఫైళ్లులలో వివరించిన ప్రకారం, తనకు సహచర రూమ్మేట్ ఈ గొడవ వేకువనే సంభవించింది. నిద్రలేచే సమయానికి " తాను దేవుడిని అవమానించాడు, దాంతో నాకు ఎంతో కోపం వచ్చింది. నేను వంటగదిలోనికి వెళ్ళి ఒక పెద్ద పదునైన కత్తిని తీసుకొన్నాను. దాంతో అతని శరీరం పై దాడి చేసి అతని మెడని నరికినట్లు ఆ తర్వాత అతనిక శరీరంప కత్తితో పొడిచినట్లు వివరించారు.
ప్రతివాది ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేసినట్లు కేసు ఛార్జ్ అయ్యింది. ఈ నేరానికి హంతకునికి యావజ్జీవ జైలు లేదా మరణశిక్ష పడే అవకాశముంది. హై క్రిమినల్ కోర్టు అతనికి శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో మరింత పరిశోధనల కోసం నిందితునికి 15 రోజులు రిమాండ్ విధించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







