లైసెన్స్ లేని రెస్టారెంట్ లో మద్యం, పంది మాంసం విక్రయాలు
- October 01, 2023
కువైట్: కువైట్ ఒక ప్రైవేట్ నివాసాన్ని లైసెన్స్ లేని రెస్టారెంట్గా నడుపుతున్నందుకు, మద్యంతోపాటు పంది మాంసాన్ని అందిస్తున్నారనే ఆరోపణలపై క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ 8 మందిని అరెస్టు చేసింది. వారు ఒక ప్రైవేట్ నివాసాన్ని రెస్టారెంట్గా మార్చారు. పంది మాంసంతో పాటు దిగుమతి చేసుకున్న మరియు స్థానికంగా తయారు చేసిన ఆల్కహాలిక్ పానీయాలను వినియోగదారులకు అందిస్తున్నారు. అవసరమైన చట్టపరమైన అనుమతి పొందిన తరువాత, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి వారందరినీ అరెస్టు చేసింది. స్థానికంగా తయారైన 489 మద్య పానీయాలు, మద్యంతో కూడిన 54 జార్లు, దిగుమతి చేసుకున్న 10 మద్యం సీసాలు, 218 కిలోల పందిమాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







