గల్ఫ్ అమరులు... అందని మృతధన సహాయం

- May 21, 2016 , by Maagulf

ఎడారి ఎండలో చెమటను చిందించి గల్ఫ్ వలసకార్మికులు విదేశీ మారకద్రవ్యాన్ని భారత్ కు పంపి మాతృదేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వీరి స్వేదంతో భారత ప్రభుత్వం ఇంధనం (పెట్రోల్, డీజిల్) కొనుగోలు చేస్తున్నది. సైనికులు దేశ సరిహద్దుల్లో కష్టపడుతున్నట్లుగానే, గల్ఫ్ కు వెళ్ళిన కార్మికులు దేశంఆవల విదేశీగడ్డపై కుటుంబం కోసం, మాతృభూమి కోసం శ్రమిస్తున్నారు. గల్ఫ్ లో చనిపోయిన శ్రమజీవులను 'గల్ఫ్ అమర వీరులు' అనకున్నా... కనీసం 'గల్ఫ్ అమరులు' అని పిలుచుకుందాం. Gulf Martyrs (గల్ఫ్ మార్టియర్స్). 

తెలంగాణ రాష్ట్రంలో 600 కు పైగా గల్ఫ్ మృతుల కుటుంబాలు ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా పెట్టుకున్న దరఖాస్తులను ప్రభుత్వం తిప్పి పంపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసింది శూన్యం.  

ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి అలసిపోయిన గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఉడతా భక్తిగా సహాయం చేయడానికి దుబాయి లోని 'ఐ-కేర్ ఫౌండేషన్' అనే సంస్థ కరీంనగర్ జిల్లాలోని రెండు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం 'ప్రవాసి మిత్ర' మాసపత్రిక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com