గల్ఫ్ అమరులు... అందని మృతధన సహాయం
- May 21, 2016
ఎడారి ఎండలో చెమటను చిందించి గల్ఫ్ వలసకార్మికులు విదేశీ మారకద్రవ్యాన్ని భారత్ కు పంపి మాతృదేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వీరి స్వేదంతో భారత ప్రభుత్వం ఇంధనం (పెట్రోల్, డీజిల్) కొనుగోలు చేస్తున్నది. సైనికులు దేశ సరిహద్దుల్లో కష్టపడుతున్నట్లుగానే, గల్ఫ్ కు వెళ్ళిన కార్మికులు దేశంఆవల విదేశీగడ్డపై కుటుంబం కోసం, మాతృభూమి కోసం శ్రమిస్తున్నారు. గల్ఫ్ లో చనిపోయిన శ్రమజీవులను 'గల్ఫ్ అమర వీరులు' అనకున్నా... కనీసం 'గల్ఫ్ అమరులు' అని పిలుచుకుందాం. Gulf Martyrs (గల్ఫ్ మార్టియర్స్).
తెలంగాణ రాష్ట్రంలో 600 కు పైగా గల్ఫ్ మృతుల కుటుంబాలు ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా పెట్టుకున్న దరఖాస్తులను ప్రభుత్వం తిప్పి పంపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసింది శూన్యం.
ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి అలసిపోయిన గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఉడతా భక్తిగా సహాయం చేయడానికి దుబాయి లోని 'ఐ-కేర్ ఫౌండేషన్' అనే సంస్థ కరీంనగర్ జిల్లాలోని రెండు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం 'ప్రవాసి మిత్ర' మాసపత్రిక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నది.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









