జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 26, 27తేదీల్లో జాబ్‌మేళా

- May 21, 2016 , by Maagulf
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 26, 27తేదీల్లో జాబ్‌మేళా

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఈనెల 26, 27తేదీల్లో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాబ్‌మేళాను ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు ఉంటాయని, మరుసటిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్యూల నిర్వహణ, నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. పదవ తరగతి వరకు చదివినవారు మొదలుకొని వివిధ ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యాకోర్సులు అభ్యసించినవారు విద్యాప్రమాణ పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో జాబ్ మేళాలలో పాల్గొనాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com