జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 26, 27తేదీల్లో జాబ్మేళా
- May 21, 2016
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈనెల 26, 27తేదీల్లో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజ్లో జాబ్మేళాను ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు ఉంటాయని, మరుసటిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్యూల నిర్వహణ, నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. పదవ తరగతి వరకు చదివినవారు మొదలుకొని వివిధ ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యాకోర్సులు అభ్యసించినవారు విద్యాప్రమాణ పత్రాలు, రెండు పాస్పోర్టు సైజు ఫోటోలతో జాబ్ మేళాలలో పాల్గొనాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







