ఇరాక్ లో మరో దారుణం..
- May 21, 2016
ఇరాక్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి బాంబు దాడులు జరగడంతో ఏడు మందికి పైగా మృతిచెందగా, మరో 30 మంది గాయాలపాలయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందిని ఇరాక్ అధికారులు వెల్లడించారు. దుజైల్ పట్టణంలో సలాహుద్దీన్ సరిహద్దులో ఓ గుర్తుతెలియని దుండగుడు నడుముకు కట్టుకున్న బెల్టు బాంబును పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మార్కెట్ ఏరియాలో ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి వస్తుంటారని ప్రాణనష్టం ఎక్కువ జరగాలని భావించి ఈ ప్రాంతంలో అలాంటి చర్యకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.అయితే మృతుల సంఖ్యపై స్పష్టతలేదని, పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. గత మంగళవారం కూడా ఇరాక్ లో బాంబు దాడి జరిగి 36 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి తమదే బాధ్యతని, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







