ఇరాక్ లో మరో దారుణం..

- May 21, 2016 , by Maagulf
ఇరాక్ లో మరో దారుణం..

ఇరాక్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి బాంబు దాడులు జరగడంతో ఏడు మందికి పైగా మృతిచెందగా, మరో 30 మంది గాయాలపాలయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందిని ఇరాక్ అధికారులు వెల్లడించారు. దుజైల్ పట్టణంలో సలాహుద్దీన్ సరిహద్దులో ఓ గుర్తుతెలియని దుండగుడు నడుముకు కట్టుకున్న బెల్టు బాంబును పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మార్కెట్ ఏరియాలో ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి వస్తుంటారని ప్రాణనష్టం ఎక్కువ జరగాలని భావించి ఈ ప్రాంతంలో అలాంటి చర్యకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.అయితే మృతుల సంఖ్యపై స్పష్టతలేదని, పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. గత మంగళవారం కూడా ఇరాక్ లో బాంబు దాడి జరిగి 36 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి తమదే బాధ్యతని, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com