ఇరాక్ లో మరో దారుణం..
- May 21, 2016
ఇరాక్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి బాంబు దాడులు జరగడంతో ఏడు మందికి పైగా మృతిచెందగా, మరో 30 మంది గాయాలపాలయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందిని ఇరాక్ అధికారులు వెల్లడించారు. దుజైల్ పట్టణంలో సలాహుద్దీన్ సరిహద్దులో ఓ గుర్తుతెలియని దుండగుడు నడుముకు కట్టుకున్న బెల్టు బాంబును పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మార్కెట్ ఏరియాలో ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి వస్తుంటారని ప్రాణనష్టం ఎక్కువ జరగాలని భావించి ఈ ప్రాంతంలో అలాంటి చర్యకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.అయితే మృతుల సంఖ్యపై స్పష్టతలేదని, పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. గత మంగళవారం కూడా ఇరాక్ లో బాంబు దాడి జరిగి 36 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి తమదే బాధ్యతని, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









