ఇరాక్ లో మరో దారుణం..
- May 21, 2016
ఇరాక్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి బాంబు దాడులు జరగడంతో ఏడు మందికి పైగా మృతిచెందగా, మరో 30 మంది గాయాలపాలయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందిని ఇరాక్ అధికారులు వెల్లడించారు. దుజైల్ పట్టణంలో సలాహుద్దీన్ సరిహద్దులో ఓ గుర్తుతెలియని దుండగుడు నడుముకు కట్టుకున్న బెల్టు బాంబును పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మార్కెట్ ఏరియాలో ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి వస్తుంటారని ప్రాణనష్టం ఎక్కువ జరగాలని భావించి ఈ ప్రాంతంలో అలాంటి చర్యకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.అయితే మృతుల సంఖ్యపై స్పష్టతలేదని, పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. గత మంగళవారం కూడా ఇరాక్ లో బాంబు దాడి జరిగి 36 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి తమదే బాధ్యతని, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









